మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఇప్పుడు చేయనున్న అవైటెడ్ ప్రాజెక్ట్ లలో తన కెరీర్ 158వ సినిమా కోసం అందరికీ తెలిసిందే. దర్శకుడు బాబీ తెరకెక్కించనున్న ఈ సినిమా ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని ఎదురు చూస్తున్నారు. అయితే ఫైనల్ గా ఈ ఏప్రిల్ 11 న గ్రాండ్ గా లాంచ్ అవుతుంది అని టాక్ వచ్చింది. అయితే ఈ డేట్ లోనే సినిమా లాంఛ్ చేయనుండగా ఇప్పుడు మరో క్రేజీ బజ్ వినిపిస్తోంది.
ఈ లాంఛ్ కోసం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రత్యేక అతిథిగా హాజరు కానున్నారు అని వినిపిస్తోంది. మరి దీనిపై అధికారిక క్లారిటీ బయటకు రావాల్సి ఉంది. ఇక ఈ సినిమాకి థమన్ సంగీతం అందించే అవకాశం ఉండగా కే వి ఎన్ ప్రొడక్షన్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేసే సన్నాహాలు చేస్తున్నారు అని టాక్.


