మెగా హీరో సాయి దుర్గా తేజ్ నటిస్తున్న పీరియడ్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘సంబరాల ఏటిగట్టు’ ఇప్పటికే ప్రేక్షకుల్లో సాలిడ్ బజ్ క్రియేట్ చేసింది. ప్రైమ్షో ఎంటర్టైన్మెంట్ పతాకంపై కే నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో సాయి దుర్గా తేజ్ రఫ్ అండ్ రగడ్ లుక్ లో కనిపిస్తాడు.
తాజాగా ఈ సినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్ పై అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. ఈ ప్రెస్టిజియస్ చిత్రాన్ని సంక్రాంతి బరిలో 2027 జనవరి 12న గ్రాండ్ రిలీజ్ చేస్తున్నట్టు మేకర్స్ ప్రకటించారు. దీనికి సంబంధించి ఓ పవర్ఫుల్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్లో ఆయన ఇంటెన్స్ అండ్ రస్టిక్ లుక్ ప్రేక్షకులను, మెగా అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. రోహిత్ కేపీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్ గా నటిస్తుండగా, అజనీష్ లోక్నాథ్ సంగీతం అందిస్తున్నారు.
పండుగ రేసులో బాక్సాఫీస్ వద్ద రచ్చ చేయడానికి సిద్ధమవుతున్న ఈ పీరియడ్ డ్రామాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘హనుమాన్’ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత ప్రైమ్షో ఎంటర్టైన్మెంట్ కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో పండుగ సీజన్లో ఈ చిత్రం సరికొత్త రికార్డులు సృష్టిస్తుందని సినీ ప్రేమికులు భావిస్తున్నారు.


