ఆది హీరోగా శ్రీనివాస్ నాయుడు నందికట్ల తెరకెక్కించిన ‘శశి’ సినిమా ద్వారా రాశీ సింగ్ తెలుగు ప్రేక్షకుల్ని పలకరించనుంది. సురభి మరో నాయిక. ఈ సినిమా మార్చి 19 విడుదలవుతున్న సందర్భంగా విలేకర్లతో ముచ్చటించింది రాశీ సింగ్. ఆమె పంచుకున్న ఆసక్తికర విశేషాలివీ…
మీ పర్సనల్ లైఫ్ గురించి ? అలాగే నటన పై ఎలా ఆసక్తి కలిగింది ?
నా స్వస్థలం రాయ్పూర్. చిన్నప్పటి నుంచే నాకు నటన అంటే ఆసక్తి. ఆ ఇంట్రస్ట్ తోనే సీరియల్స్ ఎక్కువుగా చూస్తూ వాటిల్లోని పాత్రలను ప్రాక్టీస్ చేసేదాన్ని. ఇదంతా చూసి అమ్మ నన్ను నటిని చేయాలనుకుంది. నేను ఇక్కడి వరకు రావడానికి ఆమె ప్రోత్సాహం ఎంతో ఉంది.
హీరోయిన్ కాకముందే జాబ్ చేశారట ?
అవును, మోడలింగ్, ఎయిర్ హోస్టెస్గా పనిచేశాను. సంవత్సరం పాటు ఇండిగో ఎయిర్ లైన్స్లో విధులు నిర్వర్తించాను. ఆ సమయంలోనే హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాను. ఇక్కడి వచ్చాక సినీ ప్రయత్నాలు మొదలుపెట్టగా అలా పూరీ కనెక్ట్స్ ఏజెన్సీ ద్వారా అవకాశం వచ్చింది.
‘శశి’ సినిమా గురించి ?
‘శశి’ కంటే ముందు నేను మరో సినిమాలో నటించినా.. నా తొలి చిత్రంగా ‘శశి’నే విడుదలవుతుంది. అందరికీ కనెక్ట్ అయ్యే కథ శశి. ఇందులో నా పాత్ర పేరు సునీత. గాయనిగా కనిపిస్తాను. నిస్వార్థమైన అమ్మాయి. హోమ్లీగా ఉంటుంది.
మరో నాయిక సురభితో కలిసి నటించడం ఎలా అనిపిచింది ?
సురభి చాలా బాగా నటించింది. నా కంటే సీనియర్ అనే భావన ఎప్పుడూ కలగలేదు. మా ఇద్దరి కాంబినేషన్లో సన్నివేశాలు లేకపోవడంతో ఆమెతో కలిసి నటించే అవకాశం రాలేదు.
హీరో ఆది గురించి ?
ఆది జెంటిల్మెన్. ఆన్ సెట్, ఆఫ్ సెట్ ఒకేలా ఉంటాడు. చాలా కంఫర్టబుల్. ఈ చిత్ర టీజర్, ట్రైలర్, పాటలకు మంచి స్పందన వచ్చింది. సినిమా విజయం అందుకుంటుందని నమ్మకం ఉంది.
భవిష్యత్తు ప్లాన్స్ ఏమిటి ?
హైదరాబాద్ రాక ముందు టాలీవుడ్ హీరోల్లో ప్రభాస్, రానా తెలుసు. సినిమా ప్రచారంలో భాగంగా రానాని కలవడం చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడిప్పుడే ఇతర నటీనటులు, దర్శకుల వివరాలు తెలుసుకుంటున్నాను. నటనలో నాకు ప్రియాంక చోప్రా స్ఫూర్తి. దక్షిణాది చిత్రాలంటే చాలా ఇష్టం. అల్లు అర్జున్, రాజమౌళితో పనిచేయాలని ఉంది. ఒకే రకమైన పాత్రలకు పరిమితం కాకుండా అన్ని జోనర్లలో నటించాలనేదే నా లక్ష్యం.