ఇళయదళపతి విజయ్ జోసెఫ్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా దర్శకుడు హెచ్ వినోద్ తెరకెక్కించిన అవైటెడ్ సినిమా జన నాయగన్ లీక్ అయ్యి షాకింగ్ గా మారిన సంగతి అందరికీ తెలిసిందే. మంచి అంచనాలు ఉన్న ఈ సినిమా ఇంకా థియేటర్లులోకి రాకుండా పలు ఇబ్బందులు ఎదుర్కోవడం ఒకెత్తు అయితే దానికి ముందే ఆన్లైన్ లో క్వాలిటీ ప్రింట్ బయటకి రావడం అనేది మరింత షాకింగ్ గా మారింది.
అయితే ఈ లీక్ కేసులో లేటెస్ట్ అప్డేట్ ఇప్పుడు తెలుస్తున్నాయి. మేకర్స్ వేసిన కేసులో భాగంగా తాము ఈ సినిమా ఎడిటింగ్ దశ నుంచే లీక్ అయినట్లు భావిస్తున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు సమయంలోనే ఈ సినిమా లీక్ చేసారని ఇప్పుడు సర్క్యులేట్ అవుతున్న వీడియో ఫుటేజ్ లో వాటర్ మార్క్ ద్వారా ఇది అక్కడ నుంచే వచ్చినట్లు తెలుస్తోంది.
అంతేకాకుండా ఈ లీక్ అండ్ సర్క్యులేట్ లో మొత్తం ఐదుగురు ప్రధాన నిందితులను పోలీసులు పట్టుకున్నట్టు తెలుస్తోంది. వారే సోషల్ మీడియాలో జన నాయగన్ లింక్స్ ని షేర్ చేసారని ఓ వెర్షన్ వినిపిస్తోంది. ఓ పక్క కోలీవుడ్ నుంచి మరింతమంది సినీ తారలు జన నాయగన్ లీక్ విషయంలో మేకర్స్ కి మద్దతుగా నిలుస్తున్నారు.
