“పుష్ప 2”.. ఈలోపే ఒక సెన్సేషనల్ సర్ప్రైజ్ అట


పాన్ ఇండియా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న అవైటెడ్ చిత్రం “పుష్ప 2 ది రూల్” కోసం అందరికి తెలిసిందే. మరి ఈ సినిమా నుంచి మేకర్స్ నిన్ననే మొదటి సాంగ్ తాలూకా ప్రోమోని రిలీజ్ చేయగా దీనికి డిఫరెంట్ రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ ఫుల్ సాంగ్ ని మేకర్స్ ఈ మే 1న రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే.

అయితే లేటెస్ట్ గా ఓ సాలిడ్ అప్డేట్ ని మేకర్స్ అందించారు. ఈ ఫస్ట్ సింగిల్ వచ్చే లోపే ఒక సెన్సేషనల్ సర్ప్రైజ్ ని అందిస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. దీనితో ఈ సర్ప్రైజ్ ఏంటి అనేది ఆసక్తిగా మారింది. మరి ఇది పాటకి సంబంధించినదా లేక ఇతర అంశమా అనేది వేచి చూడాలి. ఇక ఈ చిత్రానికి దేవిశ్రీ సంగీతం అందించగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్నారు. అలాగే ఈ ఆగస్ట్ 15న సినిమా ప్రపంచ వ్యాప్తంగా పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ కాబోతుంది.

Exit mobile version