శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ ప్రధాన పాత్రలో భారతీయుడు సీక్వెల్ ను ఘనంగా ప్రారంభించిప్పటికి.. మధ్యలో కొన్ని కారణాల వల్ల షూటింగ్ బ్రేక్ ఇచ్చారు. ఆ తరువాత షూటింగ్ ను మళ్లీ ప్రారంభించాలనుకున్నప్పటికీ.. బడ్జెట్ విషయంలో శంకర్ కి లైకా ప్రొడక్షన్స్ సంస్థతో విభేదాలు రావడం.. మొత్తానికి లైకా ప్రొడక్షన్స్ ఇచ్చిన బడ్జెట్ పరిమితుల్లోనే, శంకర్ సినిమా చెయ్యడానికి అంగీకరించడంతో సినిమా మళ్లీ మొదలైంది. కాగా తాజా సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ ఈ నెల మూడో వారం నుండి రాజమండ్రిలో ప్రారంభం కాబోతోందట. ఈ విషయాన్ని కాజల్ కూడా ఇన్ డైరెక్ట్ గా చెప్పింది.
అలాగే రాయలసీమ ప్రాంతంలో కూడా ఓ షెడ్యూల్ ను షూట్ చేయనున్నారు. ఇక కమల్ హాసన్ ఈ సినిమా కోసం బల్క్ డేట్లు ఇచ్చాడట. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ నటిస్తోంది. అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్ముస్తోంది. 2020లో ఈ సినిమా విడుదలకానుంది. ఇక టెక్ మాంత్రికుడు శంకర్ ఈ చిత్రాన్ని కూడా తన శైలిలోనే భారీ హంగులతోనే తీర్చిదిద్దనున్నారు.