వరుణ్ తేజ్ – హరీష్ శంకర్ కాంబినేషన్లో రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్న డిఫరెంట్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘వాల్మీకి’. తాజాగా ఈ సినిమా షూటింగ్ అనంతపూర్ లో ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. అయితే అక్కడ కొన్ని కీలక సన్నివేశాలను చిత్రకరణ చేస్తుండగా బోయ కులానికి చెందిన కొంతమంది అక్కడికి వచ్చి తమ కులానికి చెందిన గొప్ప వ్యక్తి పేరుని ఇలా సినిమాకు టైటిల్ గా పెట్టడం పై విచారం వ్యక్తం చేస్తూ షూటింగ్ జరగకుండా గొడవ చేసినట్లు తెలుస్తోంది. చిత్రబృందం వారికి ఎంత నచ్చచెప్పినా వాళ్ళు గొడవ ఆపకపోయే సరికి చేసేదేంలేక షూటింగ్ ను క్యాన్సిల్ చేశారట. అనంతపూర్ లో జరగాల్సిన షెడ్యూల్ ను చేవెల్ల ప్రాంత పరిధుల్లో షూట్ చేయనున్నారు.
ఇక ఇప్పటివరకు డిఫరెంట్ జోనర్స్లో, విభిన్నమైన పాత్రలు చేస్తూ ప్రేక్షకుల్ని మెప్పిస్తున్న వరుణ్ తేజ్ ఈ సినిమాలో కూడా గ్యాంగ్ స్టర్ గా మరో డిఫరెంట్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడు. ఈ సినిమాను సెప్టెంబర్ 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ఇక ప్రముఖ తమిళ్ యంగ్ హీరో అధర్వ ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. పూజా హెగ్డే, మృణాలిని రవి హీరోయిన్లుగా నటిస్తున్నారు.