వైరల్.. “అఖండ 2” పై సాలిడ్ అప్డేట్ ఇచ్చిన బోయపాటి.!


నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా శ్రీకాంత్ తదితరులు కలయికలో మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కించిన సెన్సేషనల్ హిట్ చిత్రం “అఖండ”. మరి తెలుగు సినిమాకి పూర్వ వైభవం తీసుకొచ్చిన ఈ సినిమా సీక్వెల్ కోసం ఎందరో ఎప్పుడు నుంచో ఆసక్తిగా ఎదురు చూస్తూ వస్తున్నారు.

అయితే ఈ సినిమా పై లేటెస్ట్ గా బోయపాటి శ్రీను స్పందించడం వైరల్ గా మారింది. అఖండ రెండవ భాగం ఎన్నికల తరువాత ప్రకటిస్తామని ఈ సారి సామాజిక అంశాలతో పార్ట్ 2 ఉండబోతుంది అని కన్ఫర్మ్ చేశారు. దీనితో ఈ అవైటెడ్ సీక్వెల్ కోసం ఎదురు చూస్తున్న అభిమానులకి ఈ వార్త ఊరటనిస్తుంది అని చెప్పవచ్చు. ఇక ఈ చిత్రానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ముందుముందు రానున్నాయి.

Exit mobile version