మేము సైతం – ఏకపాత్రాభినయంతో ఆకట్టుకున్న బ్రహ్మానందం..

bhramandam

నేడు తెలుగు చిత్ర పరిశ్రమ అంతా ఒక్కటై విశాఖ హుధూద్ తుఫాన్ భాదితుల సహాయార్ధం ‘మేము సైతం’ కార్యక్రమం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమం ద్వారా వచ్చిన డబ్బులను సియం రిలిఎఫ్ ఫండ్ కు అందజేస్తారు. ఈ రోజు ఉదయం ప్రారంభమైన ఈ కార్యక్రమం ప్రేక్షకులను అలరిస్తుంది.

కామెడీ కింగ్ బ్రహ్మానందం ఏకపాత్రాభినయంతో ఆకట్టుకున్నారు. మొదట తనదైన నటనతో వినోదాన్ని పండించిన ఈ హాస్య బ్రహ్మ… మహా నటుడు ఎస్వి రంగారావు డైలాగులను చెప్పి అదరహో అనిపించారు. ఇక, పెర్ఫార్మన్స్ ఎండింగ్ లో బ్రాహ్మి చేసిన ఎమోషనల్ పెర్ఫార్మన్స్ కు ప్రతి ఒక్కరి నుండి ప్రసంశలు లభిస్తున్నాయి.

‘మేము సైతం’ లైవ్ స్ట్రీమింగ్ వీడియో చూడడం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version