ఆస్థి కోసమే చక్రి కుటుంబ సభ్యుల మధ్య గొడవలు..?

Chakri
సంగీత దర్శకుడు చక్రి మరణించి మూడు రోజులు కూడా గడవక మందే ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య కలహాలు మొదలయ్యాయి. చక్రిది ప్రేమ వివాహాం. అతని మరణాంతరం భార్య శ్రావణి మరియు కుటుంబ సభ్యుల మధ్య వివాదాలు తలెత్తాయి. అత్తింటి వారు తనను వేధిస్తున్నారని, వారి నుండి ప్రాణ భయం ఉందని శ్రావణి మానవ హక్కుల కమిషన్ ను ఆశ్రయించడంతో చక్రి ఇంట్లో జరుగుతున్న గొడవలు వెలుగులోకి వచ్చాయి.

గతంలో అందరూ కలసి ఒకే ఇంట్లో ఉండేవారమని, ఆయన సంతోషంగా ఉండడం ముఖ్యమని 22 రోజుల క్రితమే అన్నయ ఇంటి నుండి వేరే ఇంటికి వెళ్ళిపోయాం. మా నుండి శ్రావణికి ఎటువంటి హాని లేదు. ఆమె ఎందుకు మానవ హక్కుల కమిషన్ వద్దకు వెళ్లిందో తెలియదని చక్రి సోదరుడు మహిత్ నారాయణ చెప్పారు.

మరోవైపు శ్రావణి ఈ వివాదంపై స్పందించేందుకు నిరాకరించారు. చక్రి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు నేను మాట్లాడే పరిస్థితిలో లేను. ఆయన కర్మకాండలన్నీ పూర్తయ్యే వరకూ ఎలాంటి వివాదాలకు వెళ్లదలచుకోలేదు అని అన్నారు.

చక్రి వివాహమై చాలా రోజులు గడిచినా వారికి సంతానం కలుగలేదు. ఇప్పుడు ఆస్థి కోసమే శ్రావణి, కుటుంబ సభ్యుల మధ్య గొడవలు జరుగుతున్నాయా..? అనే సందేహం చక్రి అభిమానుల, ఇతర వ్యక్తుల మదిలో మెదులుతున్న ప్రశ్న.

Exit mobile version