‘సరిలేరు నీకెవ్వరు’ నుండి తప్పుకుంది అందుకే !

సూపర్ స్టార్ మహేశ్ బాబు అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వస్తోన్న ‘సరిలేరు నీకెవ్వరు’ ప్రస్తుతం కాశ్మీర్ లో రెగ్యులర్ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ కాశ్మీర్ షెడ్యూల్ లో మహేష్ తో పాటు రాజేంద్ర ప్రసాద్ అలాగే కొంతమంది ముఖ్య తారాగణం కూడా పాల్గొంటున్నారు. అయితే ఈ చిత్రంలో నటిస్తున్న సీనియర్ హీరో జగపతి బాబు ఈ సినిమా నుండి తప్పుకోవడానికి కారణం.. మొదట తన పాత్రకు సంబధించిన చెప్పిన సీన్స్ కు.. షూట్ లో తన చేత చేయిస్తోన్న సీన్స్ కు చాల తేడా ఉందని.. మొత్తం మీద తన పాత్ర పట్ల ఆయన సంతృప్తి చెందక ఈ సినిమా నుండి తప్పుకున్నట్లు తెలుస్తోంది.

ఇక ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్ లో మహేష్ బాబు ఆర్మీ ఆఫీసర్ గా కనిపించే సన్నివేశాలనే మాత్రామే షూట్ చేస్తున్నారు. ఈ సినిమాలో మహేశ్ సరసన రష్మిక మండన్నా హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే ఒక్కప్పటి లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కూడా ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తోంది. ఈ చిత్రాన్ని దిల్ రాజు తో కలిసి అనిల్ సుంకర నిర్మించనున్నారు.

Exit mobile version