
మరికొన్ని గంటల్లో దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 68 వసంతాలు పూర్తవుతాయి. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ‘వందేళ్ళ వసంత గీతం’ అనే ఆల్బంను రూపొందించారు అజయ్ పులిపాటి. ‘వందేళ్ళ వసంత గీతం’లో పాటలకు యువ సంగీత దర్శకుడు సురేష్ స్వరాలను సమకూర్చారు. ఈ ఆల్బంలో ఇండియా గొప్పతనాన్ని చాటిచెప్పడానికి ప్రయత్నించారు. వేద మీడియా క్రియేషన్స్ పతాకంపై ఎన్నారై అనిల్ దీప్ చర్లపల్లి ఈ ఆల్బంను నిర్మించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో అనేక రచనలు చేసిన మిట్టపల్లి సురేందర్ లిరిక్స్ అందించారు. ఈ ఆల్బం ఆవిష్కరణ కార్యక్రమం మంగళవారం సాయంత్రం ప్రసాద్ లాబ్స్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి ఈటెల రాజేందర్, కిషన్ రెడ్డి, రసమయి బాలకిషన్ లతో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. దేశం కోసం ఏదైనా చేయాలి అనే తపనతో ఈ ఆల్బంతో రూప కల్పన చేసినట్ట నిర్మాత అనిల్ తెలిపారు. వందేమాతరం పల్లవిని తీసుకుని సమకాలిన సమస్యలతో ఈ ఆల్బం రూపొందించారు.