దేశం కోసం ‘వందేళ్ళ వసంత గీతం’.

vasanthageetam
మరికొన్ని గంటల్లో దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 68 వసంతాలు పూర్తవుతాయి. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ‘వందేళ్ళ వసంత గీతం’ అనే ఆల్బంను రూపొందించారు అజయ్ పులిపాటి. ‘వందేళ్ళ వసంత గీతం’లో పాటలకు యువ సంగీత దర్శకుడు సురేష్ స్వరాలను సమకూర్చారు. ఈ ఆల్బంలో ఇండియా గొప్పతనాన్ని చాటిచెప్పడానికి ప్రయత్నించారు. వేద మీడియా క్రియేషన్స్ పతాకంపై ఎన్నారై అనిల్ దీప్ చర్లపల్లి ఈ ఆల్బంను నిర్మించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో అనేక రచనలు చేసిన మిట్టపల్లి సురేందర్ లిరిక్స్ అందించారు. ఈ ఆల్బం ఆవిష్కరణ కార్యక్రమం మంగళవారం సాయంత్రం ప్రసాద్ లాబ్స్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి ఈటెల రాజేందర్, కిషన్ రెడ్డి, రసమయి బాలకిషన్ లతో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. దేశం కోసం ఏదైనా చేయాలి అనే తపనతో ఈ ఆల్బంతో రూప కల్పన చేసినట్ట నిర్మాత అనిల్ తెలిపారు. వందేమాతరం పల్లవిని తీసుకుని సమకాలిన సమస్యలతో ఈ ఆల్బం రూపొందించారు.

Exit mobile version