నేడు సోమవారం కావడంతో బిగ్ బాస్ లో ఎలిమినేషన్ కొరకు నామినేషన్ ప్రక్రియ జరుతుంది. హౌస్ లో ఉన్న ఇంటి సభ్యలు టాస్క్ లో చేసిన ప్రదర్శన ఆధారంగా నామినేట్ కావడం జరుగుతుంది. సాధారణంగా టాస్క్ లో ఓడిపోయిన వారు, వెనుక బడిన వారు ఎలిమినేషన్ కి నామినేట్ కావడం జరుగుతుంది. నేడు నామినేషన్ కొరకు బిగ్ బాస్ నిర్వహించిన టాస్క్ లో రాహుల్, శ్రీముఖిల మధ్య వార్ కి దారితీసింది. వీరి మధ్య వాడి వేడి మాటల యుద్ధం జరిగినట్లు ప్రోమో చూస్తే అర్థం అవుతుంది. మరి వారిద్దరి మధ్య గొడవకు కారణమైన విషయం ఏమిటీ అనేది నేటి ఎపిసోడ్ లో చూడాలి.
గార్డెన్ లో ఏర్పాటు చేసిన నంబర్ బోర్డ్స్ దగ్గర కంటెస్టెంట్స్ ని నిలబడమని చెప్పగా, అందరూ అలా చేశారు. ఈ వరుసలో బాబా భాస్కర్ మొదటి నంబర్ దగ్గర, రాహుల్ రెండు, వరుణ్ మూడు, అలీ నాలుగు, శివ జ్యోతి ఐదు, వితిక ఆరు, చివరిదైన ఏడవ బోర్డు దగ్గర శ్రీముఖి నిల్చొని వున్నారు. మరి ఈ టాస్క్ లో ఏ ప్రాదిపదికన నామినేషన్ ఉంటుందో చూడాలంటే ఇంకొన్ని గంటలు ఆగాల్సిందే. నిన్న ఎపిసోడ్ లో మహేష్ విట్టా షో నుండి ఎలిమినేట్ అయ్యి వెళ్ళిపోయిన సంగతి తెలిసిందే.
War of words between #Rahul & #Sreemukhi#BiggBossTelugu3 Today at 9:30 PM on @StarMaa pic.twitter.com/RgU5SE1Mc3
— Starmaa (@StarMaa) October 14, 2019