లేటెస్ట్ : సోషల్ మీడియా పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన జాన్వీ కపూర్


తెలుగు సహా అనేక భారతీయ భాషల్లో దిగ్గజ నటిగా కోట్లాది ప్రేక్షకాభిమానుల నుండి గొప్ప పేరు సొంతం చేసుకున్నారు దివంగత నటి శ్రీదేవి. ఇక ఆమె నట వారసురాలిగా తొలి సినిమా ధఢక్ ద్వారా చిత్ర రంగ ప్రవేశం చేసారు కూతురు జాన్వీ కపూర్. తొలి సినిమా నుండి తల్లి శ్రీదేవి మాదిరిగా ఒక్కో సినిమాలో తన ఆకట్టుకునే అందం, అభినయంతో ఎందరో ప్రేక్షకాభిమానుల ప్రేమను అందుకుంటూ దూసుకెళ్తున్నారు జాన్వీ. ఇక తరచు తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా సినీ, వ్యక్తిగత విషయాలు, పలు ఫోటోలు షేర్ చేసుకునే అలవాటు గల జాన్వీ కపూర్, తాజాగా సోషల్ మీడియా పై ఒకింత ఇంట్రెస్టింగ్ గా కామెంట్స్ చేసారు.

ఇక ఆమె ఇన్స్టాగ్రమ్ అకౌంట్ లో ప్రస్తుతం ఫాలోవర్స్ 21 మిలియన్ కి చేరుకున్నారు. అయితే ఈ విధంగా మీరు నిత్యం పలు ఫోటోలు ఇన్స్టా లో పోస్ట్ చేస్తోంది మీరు పేరున్న హీరోయిన్ గా గుర్తింపు తెచుకోవాలనా అంటూ ఒక ఇంటర్వ్యూ లో భాగంగా యాంకర్ అడిగిన ప్రశ్నకు జాన్వీ బదులిస్తూ, తన ఇన్‌స్టాగ్రామ్ ఫాలోయింగ్‌ తో తన సినీ కెరీర్‌కు ఎలాంటి సంబంధం లేదని అన్నారు. నిజానికి తన ఇన్‌స్టా ఫాలోవర్లందరూ వచ్చి తన ఇటీవలి సినిమా మిలీని కనుక వీక్షించి ఉంటే, అది భారీ బ్లాక్‌బస్టర్ అయ్యేదని ఆమె అన్నారు. అయితే, ఒక నటుడికి లేదా నటికీ పక్కాగా సోషల్ మీడియా ఫాలోయింగ్ అనేది వారి స్టార్‌డమ్‌కు నిదర్శనం కాదని ఆమె స్పష్టం చేసారు.

Exit mobile version