యువ నటీనటులు విశ్వ కార్తికేయ, ఆయుషి పటేల్ హీరోహీరోయిన్లుగా నాని మూవీ వర్క్స్, రామా క్రియేషన్స్ ఆధ్వర్యంలో నటించిన లేటెస్ట్ చిత్రం “కలియుగం పట్టణంలో”. కొత్త కాన్సెప్ట్తో వచ్చిన ఈ మూవీకి కథ, డైలాగ్స్ ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం రమాకాంత్ రెడ్డి వహించారు. డాక్టర్ కందుల చంద్ర ఓబుల్ రెడ్డి, జి.మహేశ్వరరెడ్డి, కాటం రమేష్లు నిర్మించిన ఈ చిత్రం మార్చి 29 విడుదలైంది.
ఈ సినిమాలో ఆకట్టుకునే స్క్రీన్ ప్లే, క్లైమాక్స్లో వచ్చే ట్విస్టులు ఆడియెన్స్ను ఆకట్టుకున్నాయి. విమర్శకుల ప్రశంసలు కూడా ఈ మూవీకి వచ్చాయి. విశ్వ కార్తికేయ నటన అందరినీ ఆకట్టుకుంది. నూతన దర్శకుడైనా కూడా ఆయన రాసుకున్న కథ, సినిమాను ప్రేక్షకుల ముందు తీసుకొచ్చిన ఈ ఒకరోజు లోనే అనివార్య కారణాల వల్ల ఈ చిత్రాన్ని నిలిపి వేశారు. దీనితో మళ్లీ ఈ సినిమా రిలీజ్ డేట్ను ప్రకటించబోతోన్నట్టుగా నిర్మాతలు ప్రకటించారు. మరి ఇదెప్పుడు వస్తుందో చూడాలి.
