కిచ్ఛా సుదీప్ హీరోగా అనూప్ భండారి దర్శకత్వం లో తెరకెక్కుతున్న తాజా చిత్రం విక్రంత్ రోన. ఈ చిత్రం ను జీ స్టూడియోస్, కిచ్చ క్రియేషన్స్, శాలిని ఆర్ట్స్, ఇన్వెనియో ఫిల్మ్స్ ఇండియా పతకాల పై శాలిని జాక్ మంజు మరియు అలంకార్ పాండియన్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అజనీష్ లోకనాథ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం లో నిరుప్ భండారీ మరియు నీతా అశోక్ లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఈ చిత్రం ను ఫిబ్రవరి 24 వ తేదీన విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. తాజాగా చిత్ర యూనిట్ ఒక ప్రెస్ నోట్ ను విడుదల చేయడం జరిగింది. ఈ చిత్రాన్ని ప్రస్తుతం ఉన్న కరోనా వైరస్ పరిస్థితుల కారణం గా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించడం జరిగింది. త్వరలో కొత్త విడుదల తేదీని ప్రకటించనున్నట్లు తెలిపింది.
#VikrantRona will meet you on a newer date.
Stay Safe! @KicchaSudeep @nirupbhandari @neethaofficial @Asli_Jacqueline @JackManjunath @Alankar_Pandian @shaliniartss @InvenioF @ZeeStudios_ @TSeries @LahariMusic @VikrantRona pic.twitter.com/8r3IpwWPz9— Anup Bhandari (@anupsbhandari) January 27, 2022