రీసెంట్ గా మన తెలుగు సినిమా నుంచి వచ్చిన పలు పీరియాడిక్ చిత్రాల్లో యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నిర్మాతగా చేసిన లేటెస్ట్ చిత్రం “తిమ్మరాజుపల్లి టీవీ” కూడా ఒకటి. దాదాపు కొత్త నటీనటులు, టెక్నీషియన్స్ తోనే తీసిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మరీ అంత రేంజ్ లో ఆకట్టుకోలేదు కానీ ఓకే అనిపించింది.
అయినప్పటికీ నిర్మాతగా కిరణ్ అబ్బవరం ఈ సినిమా విషయంలో అలాగే కొత్త టాలెంట్ ని పరిచయం చేసినందుకు ఆనందం వ్యక్తం చేసాడు. ఇక ఈ సినిమా ఫైనల్ గా ఓటిటి రిలీజ్ కి సిద్ధం అయ్యింది. ఈ సినిమాని మన తెలుగు స్ట్రీమింగ్ యాప్ ఆహా వారు సొంతం చేసుకోగా లేటెస్ట్ గా దీని తాలూకా డేట్ ని తాము రివీల్ చేశారు.
వింటేజ్ బ్యాక్ డ్రాప్ లో ఒక ఊర్లోకి వచ్చిన కొత్త టీవీ వల్ల వచ్చిన సమస్యలు ఏంటి అనేవి ఈ మే 15 నుంచి తెలుస్తాయని రివీల్ చేశారు. సో ఓటిటి రిలీజ్ కోసం చూస్తున్న వారికి ఇది గుడ్ న్యూస్ అని చెప్పాలి. అలాగే ఆహా గోల్డ్ యూజర్స్ అయితే ఓరోజు ముందే సినిమాని వీక్షించవచ్చు. ఇక ఈ చిత్రంలో సాయి తేజ్, వేద జలంధర్, ప్రదీప్ కొట్టే, స్వాతి కరిమిరెడ్డి, అమ్మ రమేష్, సత్యనారాయణ తదితరులు నటించగా వి మునిరాజు దర్శకత్వం వహించారు.
One missing TV.
One blamed thief.
One village waiting for the truth.#ThimmarajupalliTV premieres on May 15 only on #aha.24 Hours early acess for #ahaGold users. pic.twitter.com/DeFV7M4wnj
— ahavideoin (@ahavideoIN) May 7, 2026
