బాలు గారి ఆరోగ్యంపై తాజా బులిటెన్ సమాచారం.!

దేశ సినీ రంగం అంతా కూడా ఇపుడు ప్రముఖ లెజెండరీ గాయకులు ఎస్ పి బాలు గారి ఆరోగ్యం తొందరగా కుదుటపడాలి అని ఎంతో బలంగా కోరుకుంటున్నారు. గత కొన్ని వారాల నుంచి కరోనాతో పోరాడుతున్న బాల సుబ్రహ్మణ్యం గారి ఆరోగ్య పరిస్థితి మళ్ళీ విషమించింది అని వచ్చిన వార్తలు మరోసారి సంచలనం రేపాయి.

దీనితో తప్పుడు ప్రచారాలు కూడా ఊపందుకున్నాయి. ఈ క్రమంలో ఎస్ పి బాలు గారి తనయుడు ఎస్ పి చరణ్ ఎప్పటికప్పుడు ఆయన ఆరోగ్యానికి సంబంధించి సమాచారం అందిస్తూనే ఉన్నారు. అయితే నిన్న అర్ధ రాత్రి వచ్చిన తాజా బులెటిన్ ప్రకారం సమాచారం ఇలా ఉంది.

బాలు గారికి చికిత్స అందిస్తున్న చెన్నై ఎంజిఎం ఆసుపత్రి వారు తెలిపిన సమాచారం ప్రకారం “గత ఆగష్టు 5వ తారీఖున బాలు కరోనా పాజిటివ్ తో అడ్మిట్ అయ్యారని అక్కడ నుంచి ఈ సి ఎం ఓ మరియు వెంటిలేటర్ సహాయం ద్వారా చికిత్స అందిస్తూ వచ్చామని అయితే గత 24 గంటల్లో ఆయన ఆరోగ్యం మరింత క్షీణించగా ఆసుపత్రి వర్గాలు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని” తెలిపారు.

Exit mobile version