‘సలార్ 2’లో మరో బాలీవుడ్ హీరోయిన్ ?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సలార్’ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో ఇప్పుడు సలార్-2 పై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో భాగంగానే ‘సలార్ 2’ కోసం ప్రశాంత్ నీల్ ప్రత్యేకమైన ఫోకస్ పెట్టాడు. ఆల్ రెడీ ఇప్పటికే సలార్ 2 షూటింగ్ మొదలైంది. ఐతే, తాజాగా ఈ సినిమాకి సంబంధించి మరో క్రేజీ న్యూస్ వినిపిస్తోంది. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ మరో హీరోయిన్ గా నటించే ఛాన్స్ ఉందని టాక్ నడుస్తోంది. మరి, కియారా అద్వానీ, నిజంగానే ప్రభాస్ సరసన నటిస్తే.. ఆ క్రేజే వేరు.

కాకపోతే.. కియారా అద్వానీ పాత్ర సెకండ్ హాఫ్ లో మాత్రమే ఉంటుందని.. అలాగే ఆమె పై ఓ స్పెషల్ సాంగ్ కూడా ఉంటుందని తెలుస్తోంది. అన్నట్టు, ఈ పార్ట్ 2 సినిమాకు ‘శౌర్యాంగ పర్వం’ అనే టైటిల్‌ ను ఖరారు చేశారు. కాగా ఆ మధ్య ‘సలార్ 2’ సినిమా నిర్మాత విజయ్‌ కిరగందూర్‌ కూడా మాట్లాడుతూ.. ‘ఏప్రిల్ లో ఈ సినిమా పార్ట్-2ని స్టార్ట్ చేసి.. 2025లో రిలీజ్‌ చేస్తామన్నారు. కాగా, పార్ట్-2 సినిమా ‘గేమ్‌ ఆఫ్‌ థ్రోన్స్‌’లా ఉండనుందని ఆయన తెలిపారు.

Exit mobile version