గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా ఓ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. కాగా ఈ సినిమా షూటింగ్ ను ఫిబ్రవరి 12 నుంచి రామోజీ ఫిల్మ్ సిటీలో ఓ భారీ ఫైట్ సీక్వెన్స్ తో స్టార్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. ఇక ఈ ఫైట్ సీక్వెన్స్ పూర్తి కాగానే గోపీచంద్ మలినేని ఈ సినిమా లాంగ్ షెడ్యూల్ ను కడపలో ప్లాన్ చేశాడు.
కాగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్గా నటిస్తుండగా, థమన్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇక ‘డాన్ శీను, బలుపు, పండగ చేస్కో’ లాంటి సినిమాలతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకుని.. ‘క్రాక్’ సినిమాతో భారీ కమర్షియల్ హిట్ కొట్టి యాక్షన్ డైరెక్టర్ గా గోపీచంద్ మలినేని స్టార్ డమ్ సాధించాడు.
మరి ప్రస్తుతం బాలయ్యతో సినిమా చేస్తున్న సినిమాతో ఇక గోపిచంద్ ఏ రేంజ్ హిట్ కొడతాడో చూడాలి. అన్నట్టు ఈ సినిమాలో యాక్షన్ కింగ్ అర్జున్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడని వార్తలు వస్తున్నాయి.