మెగాస్టార్ చిరంజీవి హీరోగా దర్శకుడు అనీల్ రావిపూడి కాంబినేషన్ లో చేసిన లేటెస్ట్ చిత్రమే “మన శంకర వరప్రసాద్ గారు”(Mana Shankara Vara Prasad Garu). ఫ్యామిలీ ఆడియెన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ సినిమా ఇవాళ ప్రీమియర్స్ తో ప్రపంచ వ్యాప్తంగా షోస్ పడనున్నాయి. ఇక ఈ సంక్రాంతి బరిలో వస్తున్న ఈ సినిమా ఇంకా షోస్ పడకముందే సాలిడ్ బుకింగ్స్ ని నమోదు చేస్తుంది.
దీనితో మన శంకర వరప్రసాద్ గారు బుక్ మై షో యాప్ లో ఆల్రెడీ 2 లక్షలకి పైగా టికెట్స్ ని సేల్ చేసుకున్నట్టు మేకర్స్ చెబుతున్నారు. దీనితో ఈ సినిమా పట్ల ఆడియెన్స్ ఎలా ఆసక్తిగా ఉన్నారో అర్ధం చేసుకోవచ్చు. ఇక రేపు థియేటర్స్ లో షోస్ పడ్డాక టాక్ కరెక్ట్ గా వస్తే మాత్రం సంక్రాంతి బరిలో భారీ వసూళ్లు ఈ సినిమా సొంతం చేసుకుంటుంది అని చెప్పొచ్చు. ఇక ఈ చిత్రానికి భీమ్స్ సంగీతం అందించగా నయనతార హీరోయిన్ గా నటించింది. అలాగే వెంకీ మామ గెస్ట్ రోల్ చేశారు. ఇక ఈ చిత్రానికి సాహు గారపాటి నిర్మాణం వహించారు.
BMS gets ????????????????IFIED ????????
200K+ tickets sold for #ManaShankaraVaraPrasadGaru on @bookmyshow ????
GRAND PREMIERES TODAY????
Book your tickets now for the BIGGEST FAMILY ENTERTAINER OF SANKRANTHI 2026 ????️
— https://t.co/lJhEYNatHU#MSG MASSIVE RELEASE WORLDWIDE IN THEATRES ON… pic.twitter.com/0tSbbKXmuG— Shine Screens (@Shine_Screens) January 11, 2026
