ఆకట్టుకుంటున్న శర్వానంద్ “మనమే” టీజర్!

టాలీవుడ్ హీరో శర్వానంద్ వరుస చిత్రాలు చేస్తూ, కెరీర్ లో దూసుకు పోతున్నారు. డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం లో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ మనమే (Manamey). ఈ చిత్రం అనౌన్స్ మెంట్ తోనే అందరిలో ఆసక్తి నెలకొంది. కృతి శెట్టి ఈ సినిమా లో హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రం నుండి టీజర్ ను తాజాగా విడుదల చేసారు మేకర్స్. టీజర్ లో శర్వానంద్ చెప్పిన డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. కృతి శెట్టి చాలా గ్లామరస్ గా కనిపించింది. టీజర్ ను చూస్తుంటే డిఫెరెంట్ లవ్ స్టోరీ ను శ్రీరామ్ ఆదిత్య చూపించబోతున్నట్లు తెలుస్తోంది.

ఈ సమ్మర్ ను టార్గెట్ చేసుకున్న ఈ చిత్రానికి టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ హేషం అబ్ధుల్ వహబ్ సంగీతం అందిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వ ప్రసాద్ మరియు వివేక్ కూచిభోట్ల సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం కి సంబందించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version