ఆ క్యారెక్టర్స్‌ కు, కథకు ఎక్కడా సంబంధం లేదు – నాగార్జున

రాహుల్ ర‌వీంద్ర‌న్ ద‌ర్శ‌కత్వంలో కింగ్ నాగార్జున హీరోగా, రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌ గా న‌టిస్తోన్న చిత్రం `మ‌న్మ‌థుడు 2`. ఆగస్ట్‌ 9న సినిమా విడుదలవుతుంది. గురువారం ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా… కింగ్‌ నాగార్జున మాట్లాడుతూ ‘మన్మథుడు వచ్చి 15 సంవత్సరాలు అయ్యింది. ఇప్పుడు మన్మథుడు 2 వచ్చింది. ఏది ఎక్కువగా ఎంజాయ్‌ చేశానంటే చెప్పలేను. విజయ్‌ భాస్కర్‌ గారితో చేసిన మన్మథుడు చాలా ఈజీగా, సాఫీగా ఎలా సాగిందో.. ఈ సినిమాకు కూడా అంతే ఎంజాయ్‌ చేశాం. ఆ సమంతతో పనిచేయడాన్ని ఎంజాయ్‌ చేస్తాను. మన్మధుడులోని క్యారెక్టర్స్‌ కు, కథకు ఎక్కడా సంబంధం లేదు. తప్పకుండా ఈ సినిమా అందరినీ మెప్పించేలా ఉంటుంది” అన్నారు.

ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ కథానాయికగా నటిస్తుండగా సమంత, కన్నడ బ్యూటీ అక్షరా గౌడ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కాగా గత కొన్ని రోజుల నుండి ఈ సినిమా షూటింగ్ హైదరాబద్ లో శరవేగంగా జరుగుతుంది. ఈ చిత్రానికి నిర్మాతలు: నాగార్జున అక్కినేని, పి. కిరణ్, సంగీతం: చైతన్ భరద్వాజ్, సినిమాటోగ్రఫీ: ఎం సుకుమార్, స్క్రీన్ ప్లే: రాహుల్ రవీంద్రన్, సత్యానంద్.

Exit mobile version