రామ్ చరణ్ కోసం స్పెషల్ ప్లాన్స్ వేస్తున్న మెగా ఫ్యాన్స్

dhruva
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ చేసున్న తాజా చిత్రం ‘ధృవ’ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంద. ఈ చిత్రం కోసం చరణ్ బాగానే కష్టపడుతున్నాడు. తమిళ సూపర్ హిట్ మూవీ ‘తనీ ఒరువన్’ కు రీమేక్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమా డిసెంబర్ 2న విడుదలకానుంది. విడుదలకు ఎక్కువ సమయం లేకపోవడం వలన మెగా అభిమానులంతా సినిమాను భారీ స్థాయిలో జనాల్లోకి తీసుకెళ్లాలని, ఇంకొన్ని రోజుల్లో జరగబోయే ఆడియో వేడుకను వైభవంగా జరపాలని అనుకుంటున్నారు.

అందుకే హైదరాబాద్ లోని మెగా అభిమాన సంఘాల సీనియర్ నాయకులు, ఇతర ముఖ్య కార్యకర్తలంతా కలిసి ఈ నెల 29న అనగా శనివారం ఉదయం 10:35 గం. లకు మెగా కాంపౌండ్ చిరంజీవి బ్లడ్ బ్యాంకులో విస్తృత స్థాయి మీటింగ్ ను ఏర్పాటు చేసుకున్నారు. ఈ మీటింగ్ లో సినిమా ప్రమోషన్లు కొత్త రకంగా ఎలా చేయాలి, ఏ విధానాల్ని పాటించాలి, రాబోయే ఆడియో వేడుకను ఏవిధంగా నిర్వహించాలి అనే విషయాలపై చర్చలు జరపనున్నారు. ఈ సమావేశంలో రామ్ చరణ్ పాల్గొంటారా లేదా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. పతాకంపై అల్లు అరవింద్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో చరణ్ సరసన రకుల్ ప్రీ హీరోయిన్ గా నటిస్తుండగా అరవింద స్వామి విలన్ పాత్ర పోషిస్తున్నాడు.

Exit mobile version