ప్రముఖ తమిళ నటుడు శరత్ కుమార్ కూతురు వరలక్ష్మి నాగ చైతన్య సరసన హీరొయిన్ గా చేయబోతుంది. నాగ చైతన్య తరువాత చేయబోతున్న ద్విభాషా చిత్రం ‘గౌరవం’ చిత్రం కోసం ఆమెను ఎంపిక చేసినట్లు సమాచారం. ఇట్టేవలె ఈమె పై ఫోటో షూట్ కూడా చేసినట్లు సమాచారం. విశ్వసనీయ సమాచారం ప్రకారం వరలక్ష్మిని హీరోయిన్ గా ధృవీకరించినట్లు సమాచారం. గతంలో ‘ఆకాశమంత’, ‘గగనం’ చిత్రాలకు దర్శకత్వం వహించిన రాధామోహన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నారు. గౌరవం చిత్రం గ్రామీణ నేపధ్యంలో ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కనుంది. తమన్ సంగీతం అందించనున్న ఈ చిత్రం అన్నపూర్ణ స్టూడియో బ్యానర్ పై తెరకెక్కుతుంది.