“RRR”లో ముఖ్యంగా ఈ అంశంపై ఓ రేంజ్ లో సరికొత్త మీమ్స్.!

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు హీరోలుగా దర్శక దిగ్గజం రాజమౌళి తెరకెక్కించిన ఈ భారీ పాన్ ఇండియా సినిమా “రౌద్రం రణం రుధిరం” ఇప్పుడు ఓ రేంజ్ లో సెన్సేషన్ ని నమోదు చేస్తుంది. అయితే ఈ సినిమా స్టార్ట్ అయ్యినప్పటి నుంచి కూడా రిలీజ్ అయ్యే వరకు ఈ సినిమాపై సోషల్ మీడియాలో వచ్చిన మీమ్స్ అన్ని ఇన్ని కావు.

మరి వీటిపై ఏకంగా చిత్ర యూనిట్ ఒక స్పెషల్ ఇంటర్వ్యూ ని కూడా ప్లాన్ చేసి రిలీజ్ చెయ్యగా భారీ రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ సినిమా రిలీజ్ అయ్యాక మాత్రం దాదాపు సోషల్ మీడియాలో 90 శాతం మేర ఈ సినిమాలో ఒక అంశంపై పెద్ద ఎత్తున ఫన్నీ మీమ్స్ పడుతున్నాయని చెప్పాలి.

సెకండాఫ్ లో తారక్ తీసుకెళ్లే పులులు తోడేళ్లతో ఒక క్రేజీ సీక్వెన్స్ ఉంటుంది. అందులో చరణ్ ఓ పులిని దెబ్బ కొడతాడు. ఈ పర్టిక్యులర్ సీన్స్ కి సంబంధించి అయితే ఇప్పటికీ సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో మీమ్స్ పడుతున్నాయి. ఇవి కూడా చిత్ర బృందం వరకు వెళ్లే ఉండొచ్చు కానీ ఇవి మాత్రం ఇపుడు అందరికీ మంచి ఎంటర్టైన్మెంట్ ని అందిస్తున్నాయి.

Exit mobile version