పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ తో ఓ భారీ యాక్షన్ డ్రామా తెరకెక్కించనున్నాడని వార్గతలు రావడం, దానికితగ్గట్లు ప్రశాంత్ నీల్, మైత్రి మూవీ మేకర్స్ పరోక్షంగా ట్వీట్స్ చేయడం జరిగింది. ఎన్టీఆర్ తో ప్రశాంత్ నీల్ మూవీ ఇక అధికారికమే అని అందరూ అనుకున్నారు. కానీ అంతలో ప్రశాంత్, ప్రభాస్ తో సినిమా ఎనౌన్స్ చేయడం సడెన్ గా జరిగిపోయింది. ఇంతకీ ఎన్టీఆర్ తో ప్రశాంత్ సినిమా ఉందా లేదా అని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
దీని పై తమకు స్పష్టత ఇవ్వాలని ఎన్టీఆర్ అభిమానులు సోషల్ మీడియా ద్వారా ఆయనను కోరుతూ.. ప్రశాంత్ నీల్ తమ సందేశాలకు స్పందించడం లేదని, కనీసం మైత్రి మూవీ మేకర్స్ అయినా ఈ ప్రాజెక్ట్ గురించి వివరణ ఇస్తే బాగుండు అని ఫ్యాన్స్ రిక్వెస్ట్ చేస్తున్నారు. అయితే అలాంటి ఫ్యాన్స్ కోసం లేటెస్ట్ అప్ డేట్ 2022లో ప్రశాంత్ – ఎన్టీఆర్ మొదలవుతుందని.. ప్రభాస్ సినిమా ప్రశాంత్, ఎన్టీఆర్ తోనే సినిమా చేస్తాడని తెలుస్తోంది. ఇక ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ షూట్ లో పాల్గొంటున్న ఎన్టీఆర్… ఆ తరువాత త్రివిక్రమ్ దర్శకత్వంలో మూవీ చేయనున్నారు.
