గత నెల 27న వైద్యురాలిపై అత్యాచారం చేసి, హత్య చేసిన నలుగురు నిందితులను పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. షాద్నగర్ సమీపంలోని చటాన్పల్లి వద్ద క్రైమ్ సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తుండగా నలుగురు నిందితులు పారిపోవడానికి ప్రయత్నం చేయగా నలుగురునీ పోలీసులు ఎన్కౌంటర్ చేశారు.
ఈ ఎన్కౌంటర్పై సామాన్య జనం హర్షం వ్యక్తం చేస్తుండగా సినీ ప్రముఖులు సైతం సంతృప్తి తెలుపుతున్నారు. స్టార్ హీరో ఎన్టీఆర్ ఈ ఎన్కౌంటర్పై స్పందిస్తూ న్యాయం జరిగింది. దిశ ఇప్పుడు విశ్రాంతి తీసుకో అంటూ తన అభిప్రాయాన్ని, పోలీసులపై చర్యపై సంతృప్తిని వ్యక్తం చేశారు. ఇక ఇతర సెలబ్రిటీలు సైతం ఈ ఘటన పట్ల సానుకూలంగానే మాట్లాడుతున్నారు.
JUSTICE SERVED! Now, Rest In Peace Disha.
— Jr NTR (@tarak9999) December 6, 2019