ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ మూవీ అప్డేట్ కి రంగం సిద్ధం!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ చివరిసారిగా రౌద్రం రణం రుధిరం (RRR) చిత్రం లో కనిపించారు. కొమురం భీమ్ పాత్రలో ప్రేక్షకులను, తన అభిమానులని విశేషం గా ఆకట్టుకున్నారు. ఈ హీరో ప్రస్తుతం దేవర మరియు వార్ 2 చిత్రాల షూటింగ్ తో బిజీగా ఉన్నారు. దేవర చిత్రం అక్టోబర్ నెలలో రిలీజ్ కి రెడీ కాగా, వార్ 2 మూవీ వచ్చే ఏడాది థియేటర్ల లోకి రానుంది. అయితే అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రశాంత్ నీల్ మూవీ అప్డేట్ పై తాజాగా ఒక క్లారిటీ వచ్చింది.

ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ తో సినిమా చేయనున్నట్లు గతంలో వెల్లడించిన సంగతి అందరికీ తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ చిత్రం ను నిర్మించనున్నారు. అయితే ఎన్టీఆర్ పుట్టిన రోజు అయిన మే 20, 2024 న ఈ చిత్రం కి సంబందించిన అనౌన్స్ మెంట్ రానుంది. అదే రోజున టైటిల్ కూడా రివీల్ ను చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రశాంత్ నీల్ చివరిగా దర్శకత్వం వహించిన సలార్ మూవీ ప్రేక్షకులను, అభిమానులని అలరించడం మాత్రమే కాకుండా, బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టింది. ఈ క్రేజీ కాంబినేషన్ పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

Exit mobile version