భారీ ధరకు అమ్ముడైన ‘పడిపడి లేచె మనసు’ శాటిలైట్ హక్కులు !

యువ హీరో శర్వానంద్ , ఫిదా బ్యూటీ సాయి పల్లవి జంటగా నటిస్తున్న చిత్రం ‘పడిపడి లేచె మనసు’. హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి విడుదల కు ముందే భారీ డీల్ కుదిరింది. ఈచిత్రం యొక్క డిజిటల్,తెలుగు శాటిలైట్ హక్కులు అలాగే హిందీ డబ్బింగ్ రైట్స్ కలిపి 12కోట్లకు అమ్ముడైనట్లు సమాచారం. ఇక ఇప్పటివరకు శర్వా కెరీర్ లో శాటిలైట్ హక్కులకు సంబంధించి అత్యధిక బిజినెస్ చేసిన చిత్రం ఇదే కావడం విశేషం.

రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సాయి పల్లవి డాక్టర్ గా నటిస్తుండగా శర్వా ఫుట్ బాల్ ప్లేయర్ గా కనిపించనున్నాడు. విశాల్ చంద్ర శేఖర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని చెరుకూరి సుధాకర్ , చుక్కపల్లి ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈచిత్రం ఈ డిసెంబర్ 21 న ప్రేక్షకులముందుకు రానుంది.

Exit mobile version