ప్రియదర్శి, డైలాగ్ కింగ్ సాయికుమార్ ప్రధాన పాత్రల్లో నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ ‘సుయోధన’. ద్రిషిక చందర్, సీనియర్ నటి ప్రేమ కీలక పాత్రలు పోషించారు. వై.ఎస్. మాధవ్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ప్రజ్వలా లైన్ క్రియేషన్స్ బ్యానర్పై బోసుబాబు నిడుమోలు నిర్మించారు. శ్రీరామనవమి కానుకగా ఈ నెల 27న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా గ్రాండ్గా విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో చిత్ర బృందం ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ను ఘనంగా నిర్వహించింది.
ఈ సినిమాలో సౌండ్ (శబ్దం) అత్యంత కీలక పాత్ర పోషిస్తుందని, ప్రియదర్శి ఇందులో ఫోలే (Foley) ఆర్టిస్ట్గా విభిన్నమైన పాత్రలో కనిపించనున్నారని దర్శకుడు మాధవ్ రెడ్డి తెలిపారు. సుకుమార్ ‘1 నేనొక్కడినే’ సినిమా స్ఫూర్తితో ఈ కథ రాసుకున్నట్లు ఆయన వెల్లడించారు. సాయికుమార్ మాట్లాడుతూ.. 11 ఏళ్ల వయసులో నాటికలో దుర్యోధనుడి పాత్ర వేశానని, ఇప్పుడు మళ్లీ ఈ చిత్రంలో ‘సుయోధన’గా నటించడం ఆ పాత రోజుల్ని గుర్తుచేసిందన్నారు. ప్రతి క్షణం ‘నెక్ట్స్ ఏం జరుగుతుంది?’ అనే ఉత్కంఠను ఈ సినిమా రేకెత్తిస్తుందని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు.
అద్భుతమైన కథ, కొత్తదనంతో వస్తున్న ఈ చిత్రం తన కెరీర్లో ప్రత్యేకంగా నిలిచిపోతుందని హీరో ప్రియదర్శి అన్నారు. బడ్జెట్కు వెనుకాడకుండా నిర్మాత బోసుబాబు అత్యుత్తమ నిర్మాణ విలువలతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారని కొనియాడారు. బ్రహ్మ కడలి ఆర్ట్ వర్క్, జై క్రిష్ నేపథ్య సంగీతం, ఛోటా కె. ప్రసాద్ ఎడిటింగ్ సినిమాకు ప్రధాన బలాలు. శ్రీ లక్ష్మి పిక్చర్స్ ద్వారా డిస్ట్రిబ్యూటర్ బాపిరాజు ఈ చిత్రాన్ని థియేటర్లలోకి తీసుకువస్తున్నారు.
