రెండు సినిమాల్ని నిర్మించే పనిలో ఉన్న బెక్కెం వేణుగోపాల్ !


‘టాటా బిర్లా మధ్యలో లైల’ చిత్రంతో నిర్మాతగా తన ప్రయాణాన్ని ప్రారంబించిన బెక్కెం వేణుగోపాల్ లక్కీ మీడియాను స్థాపించి ‘సత్యభామ, మేం వయసుకు వచ్చాం, సినిమా చూపిస్త మావ, నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్’ వంటి సినిమాల్ని నిర్మించారు. తన 12 ఏళ్ల సినీ ప్రయాణంలో కష్టపడి పైకొచ్చిన ఆయన దిల్ రాజు వంటి పెద్ద నిర్మాతలతో సైతం కలిసి ‘నేను లోకల్’ వంటి సూపర్ హిట్ చిత్రాన్ని ప్రేక్షకులకందించారు.

ప్రస్తుతం ఆయన మరో రెండు సినిమాల్ని నిర్మించే పనిలో ఉన్నారు. ఆ రెండు పాజెక్టులు ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్నాయి. ఈ రెండు సినిమాలని కూడా ఇద్దరు నూతన దర్శకులు డైరెక్ట్ చేస్తుండటం విశేషం. వీటిలో ఒక చిత్రాన్ని హర్ష అనే నూతన దర్శకుడు చేయనుండగా, మరొక ప్రాజెక్టును తన బ్యానర్ లో నిర్మితమైన ‘నేను నాన్న నా బాయ్ ఫ్రెండ్స్, సినిమా చూపిస్త మావ’ వంటి చిత్రాలను డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేసిన నరేష్ రూపొందించనున్నాడు. రేపు తన పుట్టినరోజు సందర్బంగా ఈ విషయాల్ని వేణుగోపాల్ ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి తెలియజేశారు.

Exit mobile version