సూపర్స్టార్ రజనీకాంత్ రెండో కుమార్తె సౌందర్య మళ్లీ వివాహం చేసుకోబోతున్నారు. కాగా సౌందర్యకు ఇంతకు ముందే 2010లో బిజినెస్ మేన్ అశ్విన్ తో వివాహం జరిగింది. అయితే వీరి మధ్య అభిప్రాయభేదాలు రాగా ఇద్దరూ గతేడాది చట్టబద్దంగా విడాకులు తీసుకుని వీడిపోయారు. వీరికి వేద్ అనే ఐదేళ్ల కొడుకు ఉన్నాడు. ప్రస్తుతం వేద్ తన తల్లి దగ్గరే ఉంటున్నాడు.
కాగా ప్రముఖ పారిశ్రామికవేత్త కుమారుడు మరియు నటుడు వనంగాముడి విశాకన్ను సౌందర్య వచ్చే ఏడాది జనవరిలో రెండో వివాహం చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే వీరికి నిశ్చితార్థం కూడా జరిగిందట. విశాకన్ కి కూడా ఇది రెండో వివాహమే అని సమాచారం. ప్రస్తుతం విశాకన్ చెన్నైలో ఫార్మాస్యూటికల్ కంపెనీ నడుపుతున్నాడు.