విమానయాన రంగంలోకి రామ్ చరణ్ అడుగులు..

ram-charan
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కొత్త వ్యాపారం ప్రారంభిస్తున్నారు. వంకయలపాటి ఉమేష్ అనే భాగస్వామితో కలసి విమానయాన రంగంలోకి అడుగుపెడుతున్నారు. ఈ రోజు భారత కేంద్ర ప్రభుత్వం కొత్తగా 8 విమానయాన కంపెనీలకు అనుమతులు మంజూరు చేసింది. అందులో టర్బోమేఘ కంపెనీ ఒకటి. ఈ కంపెనీ ఇద్దరు డైరెక్టర్లలో రామ్ చరణ్ ఒకరు.

టర్బోమేఘ కంపెనీకి కేంద్రం రీజనల్ ఎయిర్ లైన్స్ అనుమతి మంజూరు చేసింది. అంటే ఇండియాలో కొన్ని ప్రాంతాలకు మాత్రమె సర్వీసులు నడపడానికి లైసెన్స్ లభించింది. ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానల్ మాటీవీలో కూడా రామ్ చరణ్ కు భాగస్వామ్యం ఉంది. టర్బోమేఘ కంపెనీ భవిష్యత్ ప్రణాళికల గురించి త్వరలో మరిన్ని వివరాలు వెల్లడించే అవకాశం ఉంది.

ప్రస్తుతం రామ్ చరణ్ కుటుంబ కదా చిత్రం ‘గోవిందుడు అందరివాడేలే’ షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం పూర్తయ్యాకా శ్రీను వైట్ల దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్టైనర్లో నటిస్తారు.

Exit mobile version