ఎన్.టి.ఆర్ తో కలసి తిరిగి షూటింగ్ లో పాల్గొంటున్న సమంత

samantha
వి.వి వినాయక్ దర్శకత్వంలో బెల్లంకొండ సురేష్ కొడుకు హీరోయిన్ గా నటిస్తున్న సినిమాకొసం ఇటీవలే ఇటలీ వెళ్లి వచ్చిన సమంత. ఇటలీలో ప్రధాన తారాగణం పై ఒక పాటను చిత్రీకరించారు. ఇప్పుడు హైదరాబాద్ కు తిరిగొచ్చిన సమంత మరో సినిమా షూటింగ్ లో పాల్గోనుంది

దాదాపు ముగింపు దశలో వున్న ఎన్.టి.ఆర్ రభస సినిమా షూటింగ్ లో ఈ భామ తిరిగి పాల్గుంది. ఈ సినిమాలో ప్రణీత మరో నాయిక.కందిరీగ శ్రీనివాస్ దర్శకుడు. చిత్రంలో సమంత పాత్రను చక్కగా తీర్చిదిద్దారని సమాచారం

థమన్ సంగీత దర్శకుడు. ఈ సినిమాకు కూడా బెల్లంకొండ సురేష్ నిర్మాత. రభస సినిమాను జూలై, ఆగస్ట్ లలో మనముందుకు తీసుకోచే పనిలో వున్నారు. దర్శకుడి అనారోగ్యం కారణంగా సినిమా షూటింగ్ కు జాప్యం జరిగింది

Exit mobile version