ప్రముఖ నాట్యమణి శోభా నాయుడు కన్నుమూత.!

మన దేశానికి చెందిన ఎన్నో కళలలో కూచిపూడి కళ కూడా ఒకటి. అయితే ఈ నాట్యంలో ఎంతో పొందిన మన తెలుగు నేలకు చెందిన గొప్ప మహిళా నాట్యమణి శోభా నాయుడు గారి అకాల మరణ వార్త ఇపుడు తీరని లోటుగా మారింది. 1956వ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ అనకాపల్లిలో జన్మించిన ఈమె కూచిపూడిలో సిద్దహస్తులు.

అందుకు గాను శోభా నాయుడు గారికి పద్మభూషణ్ పురస్కారం కూడా వరించింది. అయితే గత నెల రోజుల కితం ఆవిడ కాలు జారి పడడంతో తలకు చిన్న గాయం అయ్యింది. దీనితో అక్కడ నుంచి ఆమె ఆర్ధో న్యూరాలజీ సమస్యతో బాధ పడడం పైగా ఈలోపలే మళ్ళీ కరోనా సోకడంతో హైదరాబాద్ లోని ఒక ప్రయివేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతు తన తుది శ్వాస విడిచారు. దీనితో టాలీవుడ్ ప్రముఖులు ఆమె మరణం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసారు.

Exit mobile version