షూట్ కంప్లీట్ చేసుకున్న శర్వా ఇంటెన్స్ డ్రామా.!

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో శర్వానంద్ హీరోగా అను ఇమ్మాన్యుయేల్ మరియు అదితి రావు హైదరీ లు హీరోయిన్స్ గా నటిస్తున్న ఇంట్రెస్టింగ్ ఇంటెన్స్ డ్రామా చిత్రం “మహా సముద్రం”. టాలెంటెడ్ దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో నటుడు సిద్ధార్థ్ కూడా నటిస్తున్నాడు. చాలా కాలం తర్వాత సిద్ధార్థ్ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్న సినిమా కూడా ఇదే.

అయితే కొంత కాలం నుంచి తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రావు రమేష్ సహా తదితర కీలక నటులు స్ట్రాంగ్ రోల్స్ తో వస్తున్నారు. మరి ఈ చిత్రం తాలూకా టోటల్ షూట్ ఎట్టకేలకు అంతటినీ కంప్లీట్ చేసుకున్నట్టుగా మేకర్ తెలిపారు. అలాగే థియేట్రికల్ రిలీజ్ కే కన్ఫర్మ్ చేసిన ఈ చిత్రం తొందరలోనే ప్రమోషన్స్ ని కూడా మేకర్స్ స్టార్ట్ చేయనున్నారని తెలుస్తుంది. ఇక ఈ చిత్రానికి చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తుండగా ఏకే ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహించారు.

Exit mobile version