పూరి పై ప్రశ్నల వర్షం కురిపించిన ‘సిట్’ !


డ్రగ్స్ ఆరోపణలు నిమిత్తం ఈరోజు ఉదయం విచారణ కోసం సిట్ కార్యాలయానికి హాజరయ్యారు పూరి. మానసిక వైద్యునితో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందం పూరి జగన్నాథ్ ను సమగ్ర స్థాయిలో విచారించినట్టు సమాచారం. విచారణ మొత్తం చాలా పకడ్బందీగా జరిగిందని, డ్రగ్స్ మాఫియాకు సంబంధించిన వివరాలని తెలుసుకోవడం కోసం అధికారులు పూరిని కొంచెం గట్టిగానే విచారించారని తెలుస్తోంది.

ఈ విచారణలో పూరి పరిశ్రమకు 17 ఏళ్ళ క్రితం వచ్చానని, తనకు సినిమాలే ప్రపంచమని, కెల్విన్ అనే వ్యక్తిని ఒక పార్టీలో మాత్రమే కలిశానని, అంతేగాని తనకు డ్రగ్స్ వాడే అలవాటులేదంటూ సుమారు 20 ప్రశ్నలకు సమాధానాలు చెప్పారని పలు మీడియా సంస్థలు తెలుపుతున్నాయి. మరి ఈ విచారణ ఫలితం ఏమిటో తెలియాలంటే పోలీసుల నుండి అధికారిక ప్రకటన వెలువడే వరకు ఆగాల్సిందే.

Exit mobile version