ఒక సినిమా పరాజయం పాలైతే చాలు, ఆ సినిమా దర్శకుడు ఎంత టాలెంటెడ్ అయినా సరే, ఇక అతనికి అంత తేలిగ్గా అవకాశాలు రావు. సినీ రంగుల ప్రపంచంలో ఇది సర్వసాధారణమైన విషయం. ఇక ప్రస్తుత విషయానికి వస్తే.. శ్రీకాంత్ అడ్డాల.. కొత్త బంగారు లోకం అంటూ యువతను ఆకట్టుకున్నే సినిమాతో తన సినీ కెరీర్ ను ప్రారంభించిన ఆయన.. ఆ తర్వాత మంచి భావేద్వేగమైన కుటుంబ కథా చిత్రాలు తీస్తాడనే మంచి పేరు తెచ్చుకున్నాడు. కానీ బ్రహ్మోత్సవం ఘోర పరాజయం కారణంగా.. మరో సినిమా మొదలుపెట్టడానికి దాదాపు శ్రీకాంత్ అడ్డాలకు మూడు సంవత్సరాలు పట్టింది.
అయితే తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం.. శ్రీకాంత్ అడ్డాల త్వరలోనే గీతా ఆర్ట్స్ బ్యానర్ లో ఓ చిత్రాన్ని ప్రారంభించబోతున్నట్టు సమాచారం. వైవిద్యమైన చిత్రాల కథానాయకుడు శర్వానంద్ తో శ్రీకాంత్ అడ్డాల ఈ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారట. దసరా పండుగ తర్వాత ఈ చిత్రం షూటింగ్ మొదలు అవ్వుతుందని తెలుస్తోంది. శ్రీకాంత్ చెప్పిన కథ.. అల్లు అరవింద్ కు బాగా నచ్చిందట. సాధ్యమైనంత త్వరగా ఈ చిత్రాన్ని పట్టాలెక్కించాలని ప్రయత్నిస్తున్నారని ఫిల్మ్ నగర్ టాక్.