ఐపీఎల్లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ క్రికెట్ జట్టుకు అంబాసిడర్ గా, ప్రస్తుతం బిజీగా ఉన్న ఒకప్పటి బాలీవుడ్ హీరోయిన్ ప్రీతీజింతా మళ్ళీ చాలా సంవత్సరాల తర్వాత ఓ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రీతీజింతా నటించిన సినిమా ‘భయ్యాజీ సూపర్ హిట్’. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్ను విడుదల చేశారు. ఏడేళ్ల క్రితం మొదలైన ఈ సినిమా కొన్ని కారణాలు వల్ల ఇప్పటికి పూర్తి అయింది.
కాగా ‘భయ్యాజీ సూపర్ హిట్’ చిత్రాన్ని ఈ దసరాకు రిలీజ్ చేయడానికి చిత్రబృందం తగిన ఏర్పాట్లు చేసుకుంటుంది. ఐతే ప్రీతీజింతా తెలుగులో విక్టరీ వెంకటేష్ తో ‘ప్రేమించుకుందాం రా’ చిత్రంలోనూ, సూపర్ స్టార్ మహేష్ బాబుతో ‘రాజకుమారుడు’ చిత్రంలోనూ హీరోయిన్ గా నటించింది.