జయప్రద, పూర్ణ, సాక్షి చౌదరి ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న చిత్రం “సువర్ణసుందరి“. సూపర్ నేచురల్ థ్రిల్లర్ గా దర్శకుడు సూర్య ఎమ్.ఎస్.ఎన్ తెరమీదకు తీసుకువస్తున్నారు. చరిత్ర భవిష్యత్తుని వెంటాడుతొందన్న క్యాప్షన్ తో భారీ బడ్జెట్ చిత్రాలకు ఏ మాత్రం తీసిపోని రీతిలో ఓ సాంకేతిక అద్బుతంగా ఎస్.టీమ్ పిక్చర్స్ పతాకంపై ఎమ్.ఎల్. లక్ష్మి నిర్మిస్తున్న ఈ చిత్రం మే 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్బంగా చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ప్రసాద్ ల్యాబ్స్ లో నిర్వహించారు. హీరో ఇంద్ర పుట్టిన రోజును పురస్కరించుకొని కేక్ ను కట్ చేయించి విషేష్ ను తెలియ చేసారు.
హీరొ ఇంద్ర మాట్లాడుతూ.. అందరం కష్టపడ్డాం.. ఈ టీమ్ తో మరో సినిమా చెయాలనుంది. దర్శక నిర్మాతల కష్టానికి తగ్గ ప్రతిఫలం బావుండాలని కొరుకుంటున్నానన్నారు. హీరోయిన్ పూర్ణ మాట్లాడుతూ.. ఈ సినిమాకు అందరం చాలా ఎక్కువ హార్ట్వర్క్ చెశాము. తెరపై అది కన్పిస్తుందన్నారు. హీరొయిన్ సాక్షి మాట్లాడుతూ .. సువర్ణ సుందరి నాకెరీర్ లొ ప్రత్యేక చిత్రం . గ్లామర్, యాక్షన్, లవ్ ,థ్రిల్ ఇలా అన్నీ అంశాలు హైలెట్ గా దర్శకుడు సూర్య సినిమా తీసారన్నారు.
జయప్రద, పూర్ణ, సాక్షి, ఇంద్ర, రామ్, సాయికుమార్, కోటాశ్రీనివాసరావు, ముక్తర్ఖాన్, నాగినీడు నటిస్తున్న ఈ చిత్రానికి ప్రొడ్యూసర్ః ఎం.ఎల్.లక్ష్మి, మ్యూజిక్ డైరెక్టర్ః సాయికార్తిక్, డి.ఓ.పి. ఎల్లుమహంతి, ఎడిటర్ః ప్రవీణ్పూడి, స్టోరీః ఎం.ఎస్.ఎన్.సూర్య, డైరెక్టర్ః ఎం.ఎస్.ఎన్.సూర్య.