మెగా హీరో సాయి ధరమ్ తేజ్ తను నటించిన కొన్ని సినీమాల్లో తన మావయ్య చిరంజీవి గారి చిత్రాల్లోని హిట్ సాంగ్స్ ను రీమిక్స్ చేసుకుంటూ వస్తున్నాడు. ఇటీవల ఈ ఐడియా అంతగా వర్క్ అవుట్ కావడం లేదు. ‘ సుప్రీమ్’ చిత్రంలో మెగాస్టార్ సినిమాల్లోని క్లాసిక్ గా నిలిచినా ‘అందం హిందోళం’ అనే సాంగ్ ను రీమిక్స్ చేసి సత్పలితాన్ని పొందాడు తేజు. ఆయన ఇటీవల నటించిన ‘ఇంటెలిజెంట్’ చిత్రంలో కూడా ఇదే సెంటిమెంట్ ను ఫాలో అయ్యాడు కాని ఆ చిత్రం దారుణమైన పరాజయాన్ని చవి చూడడంతో ఇక తను నటించే చిత్రాల్లో చిరు సాంగ్స్ ను రీమిక్స్ చేయనని అంటున్నాడట. నేను ఆయన పాటలను రీమిక్స్ చేయడం వల్ల అభిమానులుకూడా ఇబ్బంది పడుతున్నారని చెప్తున్నాడట . ఇక తేజు నటించిన ‘తేజ్ ఐ లవ్ యు’ ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చి యావరేజ్ టాక్ ను సొంతం చేసుకుంది .
