ప్రముఖ రచయిత్రి యద్దనపూడి సులోచనారాణి కన్నుమూత !

తెలుగు నవలా ప్రపంచంలో తనకంటూ ఒక సుస్థిర స్థానాన్ని ఏర్పాటు చేసుకున్న రచయిత్రి యద్దనపూడి సులోచనారాణి. ఈమె పేరు తెలియని తెలుగు నవలా పాఠకులు ఉండరనడంలో ఏమాత్రం ఆశ్చర్యం లేదు. అంతలా తన రచనలతో పాఠకులకు దగ్గరైన ఆమె 78 ఏళ్ల వయసులో కన్నుమూశారు.

కాలిఫోర్నియాలోని కుమార్తె నివాసంలో ఉంటున్న సులోచనారాణిగారు నిన్న ఆదివారం గుండెపోటుతో మరణించారు. ఆమె అంత్యక్రియలను అమెరికాలోనే నిర్వహించనున్నారు కుటుంబ సభ్యులు. 1940 కృష్ణాజిల్లాలో జన్మించిన ఈమె 1960 నుండి రచనను మొదలుపెట్టి ‘మీన, జీవన తరంగాలు, సెక్రెటరీ, అగ్ని పూలు, ప్రేమ లేఖలు, బంగారు కలలు, ఆత్మా గౌరవం’ వంటి ప్రసిద్ధ నవలలను తెలుగు పాఠక లోకానికి అందజేశారు.

Exit mobile version