గోపీచంద్ వెనుక ముగ్గురు దర్శకులు !

గోపీచంద్ వరుస పరాజాయాల తర్వాత ‘పంతం’తో ప్రేక్షకుల ముందుకు వచ్చి పర్వాలేదనిపించుకున్నాడు. కాగా ప్రస్తుతం ఈ యాక్షన్ హీరో సంపత్ నంది దర్శకత్వంలో ఓ సినిమా చెయ్యటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇటీవలే దర్శకుడు శ్రీ వాసు చెప్పిన కథ గోపీచంద్ కి బాగా నచ్చిందట.

అలాగే తమిళ దర్శకుడు తిరు చెప్పిన స్టొరీ కూడా అద్భుతంగా ఉందని, ఆ కథ నేను ఖచ్చితంగా చెయ్యాలని గోపీచంద్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. మరి ఈ ముగ్గురి దర్శకుల్లో ఏ దర్శకుడు సినిమా ముందు చెయ్యాలో ఈ హారో ఇంకా తేల్చుకోలేకపోతున్నాడట.

కాగా సంపత్ నంది ఇప్పటికే స్క్రిప్ట్ కూడా పూర్తి చేసినట్లు తెలుస్తోంది. దాదాపు గోపిచంద్ సంపత్ నంది దర్శకత్వంలోనే ముందుగా సినిమా చేసే అవకాశం ఉంది. ఈ ఏడాది చివర్లో ఈ సినిమా పట్టాలెక్కడం ఖాయంగా కనిపిస్తోంది.

అయితే వీరిద్దరి కాంబినేషన్ లో గతంలో వచ్చిన గౌతమ్ నంద చిత్రం పరాజయం అయింది. అందుకే ఈ సారి ఎలాగైనా గోపిచంద్ కి మంచి హిట్ ఇవ్వాలని సంపత్ నంది బాగా పట్టుదలగా ఉన్నాడు. మరి ఈ సారి సంపత్, గోపీచంద్ కి హిట్ ఇస్తాడేమో చూడాలి.

Exit mobile version