
సందీప్ కిషన్ ప్రస్తుతం మంచి ఫామ్ లో వున్నాడు. బీరువా కమర్షియల్ గా మంచి విజయం సాధించడంతో విజయానందంలో వున్న సందీప్ ప్రస్తుతం తన తదుపరి సినిమా టైగర్ చిత్రీకరణలో బిజీగా వున్నాడు. ఈ సినిమా నిర్మాణాంతర కార్యక్రమాలు శరవేగంగా సాగుతున్నాయి. ఈ నెల 17న ఆడియోని విడుదలచేయనున్నారు.
‘టైగర్’ చిత్రాన్ని మురగదాస్ శిష్యుడు వి.ఐ ఆనంద్ తెరకెక్కిస్తున్నాడు. ప్రముఖ నిర్మాత ఎన్.వి ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఠాగూర్ మధు సమర్పకుడు