డైరెక్ట్ ఓటిటి రిలీజ్ కి రెడీ అయిన వరుణ్ సందేశ్ మూవీ!

డిఫెరెంట్ స్క్రిప్ట్ లతో ఆడియెన్స్ ను అలరించే నటుల్లో వరుణ్ సందేశ్ ఒకరు. మంచి చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ హీరో, ఇప్పుడు కాస్త వెనక బడ్డారు. మళ్ళీ మంచి హిట్ చిత్రాలను అందించేందుకు రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం తన కొత్త సినిమా చిత్రం చూడర తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ చిత్రం థియేట్రికల్ రిలీజ్ కాకుండా, డైరెక్ట్ ఓటిటి రిలీజ్ కి రెడీ అయిపోయింది.

ఈ చిత్రం యొక్క డిజిటల్ హక్కులని ఓటిటి ప్లాట్ ఫామ్ ఈటీవీ విన్ సొంతం చేసుకుంది. లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే, ఈ చిత్రం మే 9, 2024 న స్ట్రీమింగ్ కి అందుబాటులో ఉండనుంది. ఇదే విషయాన్ని సరికొత్త పోస్టర్ ద్వారా వెల్లడించారు. ఫస్ట్‌లుక్ పోస్టర్‌లో వరుణ్ సందేశ్, ధనరాజ్ మరియు కాశీ విశ్వనాథ్ పోలీస్ స్టేషన్‌లో కూర్చున్నట్లు చూపించారు. ఈ క్రైమ్ డ్రామాలో అదితి గౌతమ్, రవిబాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Exit mobile version