పవన్ కళ్యాణ్ రీఎంట్రీపై క్లారిటీ ఇచ్చేదెవరు ?

గత కొన్నాళ్ళుగా పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వనున్నారనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే పలుసార్లు పవన్ కు సినిమాలు చేసే ఆలోచన లేదని జనసేన వర్గాలు చెప్పినా ఈ వార్తలు ఆగలేదు సరికదా ఇంకాస్త బలపడ్డాయి. దీంతో పవన్ అభిమానులు, పార్టీ కార్యకర్తల్లో గందరగోళం నెలకొంది.

మొదట క్రిష్ పవన్ కోసం ఒక సోషల్ సబ్జెక్ట్ తయారుచేశాడని, దాన్ని ఏ.ఎం.రత్నం నిర్మిస్తారని వార్తలు రాగా కొత్తగా హరీశ్ శంకర్ పవన్ సినిమాకు దర్శకత్వం వహిస్తారని, ఈ చిత్రాన్ని మైత్రి మూవీస్ నిర్మిస్తుందని చెప్పుకొస్తున్నారు. ఈ వార్తలు వింటున్న కొందరు అభిమానులైతే పవన్ రీఎంట్రీపై సంతోషం వ్యక్తం చేస్తుంటే ఇంకొందరు కరెక్ట్ కాదని అంటున్నారు.

మొత్తానికి ఈ వార్తలతో పెద్ద దుమారమైతే రేగింది కానీ వ్యవహారంలో ప్రస్తావనకు వచ్చిన వ్యక్తులు మాత్రం పెదవి విప్పట్లేదు. దీంతో ఏది నిజం, ఏది అబద్దం, అసలు పవన్ మనసులో ఏముంది అనుకుంటూ ఫ్యాన్స్ స్వీయ ప్రశ్నలు వేసుకుంటున్నారు. మరి వారి ప్రశ్నలకు సమధానం ఎప్పుడు, ఎవరి నుండి వస్తుందో చూడాలి.

Exit mobile version