స్టార్ హీరో సరసన ప్రగ్యా జైస్వాల్!

yavadu-okkadu
దర్శకుడు క్రిష్ రూపొందించిన ‘కంచె’ సినిమాలో హీరోయిన్‌గా నటించి మెప్పించిన ప్రగ్యా జైస్వాల్, ఆ తర్వాత టాలీవుడ్‌లో టాక్ ఆఫ్ ది టౌన్ అయిపోయారు. కంచెలో ఓ బలమైన పాత్రలో చక్కగా ఒదిగిపోయి నటించిన ప్రగ్యాకు ఆ తర్వాత వరుసగా అవకాశాలు వచ్చిపడుతున్నాయి. తాజాగా మాస్ మహారాజ్ రవితేజ సినిమాలో నటించే అవకాశం ప్రగ్యాకు దక్కడం ఆసక్తికరంగా మారింది.

ప్రముఖ నిర్మాత దిల్‌రాజు నిర్మాణంలో రవితేజ హీరోగా ‘ఎవడో ఒకడు’ అన్న సినిమా రూపొందుతోన్న విషయం తెలిసిందే. ‘ఓ మై ఫ్రెండ్’ ఫేం వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ఇప్పటికే ఓ హీరోయిన్‌గా ‘ప్రేమమ్’తో మెప్పించిన అనుపమ పరమేశ్వరన్ ఎంపిక కాగా, తాజాగా ప్రగ్యా జైస్వాల్‌‌ను మరో హీరోయిన్‌గా ఎంపిక చేశారు. ఇక మొదటి సినిమాతో అందం, అభినయంతో కట్టిపడేసిన ప్రగ్యా, ఆ వెంటనే రవితేజ లాంటి స్టార్ హీరో సినిమాలో నటించే అవకాశం సొంతం చేసుకోవడం విశేషంగా చెప్పుకోవచ్చు.

Exit mobile version