
వరుస విజయాల తరువాత నిఖిల్ కొంతకాలం విహారయాత్రకు విదేశాలకు వెళ్ళాడు. నిఖిల్ తాజా చిత్రం సూర్య vs సూర్య తరువాత కాస్త విరామం ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. అమెరికాలో నటనకు సంబంధించిన శిక్షణ తీసుకుంటున్న నిఖిల్ అక్కడి ప్రదేశాలను ఆస్వాదిస్తున్నాడు.
ఇటీవలే రెండవ ప్రపంచ యుద్ధంలో మరణించిన సైనికుల స్మారక చిహ్నాన్ని సందర్శించాడు. త్వరలో నిఖిల్ శంకరాభరణం షూటింగ్ లో పాల్గొననున్నాడు. కొత్త దర్శకుడు ఉదయ్ నందనవనం ఈ సినిమాను తెరకెక్కించనున్నాడు.