బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ గా వచ్చిన రాక్షసుడు సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ అందుకున్నాడు. కాగా తాజాగా ఈ హీరో
త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నారు. ఈ విషయాన్ని ఆయన తండ్రి, ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేశ్ వెల్లడించారు. ఇక రమేశ్ వర్మ దర్శకత్వంలో ఎ స్టూడియో బ్యానర్ పై కొనేరు సత్యనారాయణ నిర్మించిన ఈ చిత్రం ఆగస్ట్ 2న విడుదలైన సూపర్ హిట్ అయింది. కాగా ఈ సినిమా విజయం అందుకున్న నేపథ్యంలో శ్రీనివాస్, సురేశ్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేశ్ మాట్లాడుతూ ‘త్వరలోనే శ్రీనివాస్ వివాహం జరగబోతోంది. చిత్ర పరిశ్రమకు చెందిన అమ్మాయిని కాకుండా.. బయట నుంచి వాడికి తగిన అమ్మాయి కోసం చూస్తున్నా. ‘రాక్షసుడు’ సినిమాను సక్సెస్ చేసిన తెలుగు వారికి ధన్యవాదాలు. ఈ సినిమా మంచి వసూళ్లు సాధించడం సంతోషంగా ఉంది. శ్రీనివాస్తో పూర్తిస్థాయి కమర్షియల్ సినిమా తీయడానికి సన్నాహాలు చేస్తున్నా. ఇప్పటికే స్క్రిప్టు పని మొదలైంది. సరైన దర్శకుడి కోసం వెతుకుతున్నా. శ్రీనివాస్ పాత సినిమాలు బాక్సాఫీసు వద్ద రూ.40 కోట్ల వరకూ రాబట్టాయి. కానీ ఆ సినిమాల్ని అధిక బడ్జెట్తో నిర్మించడం వల్ల ఫెయిల్యూర్గా నిలిచాయి. కాబట్టి బడ్జెట్ను నియంత్రణలో ఉంచుకుంటే సినిమా హిట్కు ఆస్కారం ఉంటుంది’ అని బెల్లంకొండ సురేశ్ చెప్పారు.